Ap HighCourt :పిల్ ఉపసంహరణ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు పిల్స్, పిటిషన్ల అంశంపై సీరియస్ కామెంట్స్ చేసింది. పిల్‌ వేసి ఉపసంహరించుకుంటామంటే ఒప్పుకోబోమని చెప్పింది. శ్రీకాకుళం జిల్లా, గార మండలం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో అణుధార్మిక బీచ్‌శాండ్‌ తవ్వకాల టెండర్‌ను సవాల్ చేస్తూ పిల్ దాఖలైంది. అయితే ఈ పిల్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ చేసిన అభ్యర్థనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. అలాగే, గుంటూరు జిల్లా, తాడేపల్లిలో కృష్ణానది ఒడ్డున నిర్మించిన కట్టడాల కూల్చివేతకు సంబంధించిన పిల్‌ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ చేసిన ప్రయత్నాన్ని కూడా కోర్టు వ్యతిరేకించింది. ఈ రెండు కేసుల్లోనూ పిటిషనర్లు రూ.లక్ష చొప్పున కోర్టులో జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఒకసారి పిల్‌ వేసిన తర్వాత ఉపసంహరించుకుంటామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ముందుగా రూ.లక్ష రూపాయలు కోర్టులో కట్టాలని పిటిషనర్‌కు సూచించింది. ఆ తర్వాత పిల్ ఉపసంహరణ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో గ్రీన్‌ జోన్‌లో కట్టడాల కూల్చివేతకు సంబంధించిన పిల్‌ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ చేసిన ప్రయత్నాన్ని కూడా కోర్టు అడ్డుకుంది. దీనికి కూడా రూ.లక్ష జరిమానా విధించింది. పిల్‌ వేసి ఉపసంహరించుకుంటామని అంటే ఒప్పుకునేది లేదని వ్యాఖ్యానించింది.

నోటీసులు జారీడీ అడిక్షన్ సెంటర్లపై ప్రజల్లో సరైన అవగాహన లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేంద్రాలపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. మద్యం విముక్తి కేంద్రాలపై అవగాహన కల్పించడానికి తీసుకుంటున్న చర్యలు, కేటాయించిన బడ్జెట్‌ వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరోగ్య, ఎక్సైజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఒక వ్యక్తికి నెలలో అమ్మే మద్యం సీసాల సంఖ్యను పరిమితం చేయాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను మాత్రం కోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.


 Ap HighCourt :పిల్ ఉపసంహరణ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రజా ప్రయోజనండీ అడిక్షన్ సెంటర్ల పనితీరును పర్యవేక్షించాలని, బాధితులకు అందుతున్న చికిత్సను పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన షిరిన్‌ రెహ్మాన్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఆధార్‌ కార్డుతో లింక్ చేసి 21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మకుండా ఆపాలని కోరారు.హైకోర్టు, పిల్ యొక్క ఉద్దేశం ప్రజా ప్రయోజనంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఒక పిల్ దాఖలు చేసినప్పుడు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని, అంతేకాకుండా అది ప్రజా ప్రయోజనానికి అనుకూలంగా ఉందో లేదో పరిశీలించాలని హైకోర్టు అభిప్రాయపడింది.


Read Also: Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *